Sunday 16 February 2014

మానవత్వానికి ప్రతిరూపం

             ఆకలేస్తే పంచభక్ష్య పరమాన్నాలు తినే వాళ్ళు ఒక వైపు గంజి నీళ్ళతో సరి పెట్టుకునేవాళ్ళు ,పస్తులుండే వాళ్ళు మరికొందరు,లేదంటే అడుక్కునే వాళ్ళు ఇంకొందరు.
           మరి ఆకలిని తట్టుకోలేక అశుద్దాన్ని తినే వాళ్లుంటారా!స్విట్జర్లాండ్ లోని 5 నక్షత్రాల హోటల్ లోchef ఉద్యోగ మొచ్చిన ఓ యువకుడికి ఆ దృశ్యం కంట బడింది.అంతే ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఆకలికి అల్లాడిపోయే వారికోసం అక్షయ సంస్థను స్థాపించాడు.అతనే మదురై కి చెందిన నారాయనన్ కృష్ణన్.2010 సంవత్సరానికి ఆయన CNN HERO  AWARD పొందారు.ఇంట్లో  వద్దన్నా వినలేదు.తల్లిదండ్రులకు తను వారికి అన్నం పెడుతున్న ప్పుడు వారు ఆశీర్వదించే దృశ్యం చూపించాడు.వారి మనసు కరిగి ఒప్పుకున్నారు.ఆ అశుద్డాన్ని తినే వ్యక్తీ కృతజ్ఞతతో తన చేతిని పట్టుకున్నప్పుడు కలిగిన ఆనందం తన జీవితంలో ఎప్పుడు కలగలేదన్నాడు.
              మొదట్లో 30 మందికి 3 పూటలా తనే వండి తిండి పెట్టే వాడు ప్రస్తుతం అక్షయ సంస్థ 425 మందికి ప్రతి రోజు భోజనం పెడుతుంది.వారంతా నిరాదరణకు గురయిన వారు,అసహాయులు,మానసిక  వికలాంగులు. భోజనం పెట్టడంతో పాటు వారి ఒంటి శుభ్రత,ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకుంటారు. ప్రస్తుతం మదురై శివార్లలో మూడు న్నర ఎకరాల విస్తీర్ణంలో అక్షయ హోం నిర్మాణం జరుగుతుంది.వీరి చిత్త శుద్ధిని గమనించిన అమెరికాలోని ఉద్యో గులు అక్షయ USA సంస్థ ద్వారా విరాళాన్ని అందిస్తున్నాయి.వారందరినీ ఆ హోం లో చేర్చి సేవ లందించాలని కృష్ణన్ సంకల్పం.ఈ క్రింది website ను చూడండి
akshayatrust.org
ఫోన్ :09843319933

2 comments:

  1. unnaaru inkaa ilaanTi vaaru. mahaanubaavulu.

    ReplyDelete
  2. thank you madam.అందుకే ఈ సమాజం ఇంకా మనుగడ సాగిస్తుంది.

    ReplyDelete