Friday 21 February 2014

S.C హాస్టల్ లో చదువు యొక్క విలువ పై సదస్సు

              Friendsfoundation ఆధ్వర్యంలో మరొక హాస్టల్ నందు  చదువు యొక్క విలువ పై అవగాహనా సదస్సు   జరిగింది.ఈ హాస్టల్ మార్కాపుర్ లోని  తర్లుపాడు రోడ్ నందు గల మున్సిపల్ పార్క్ కు దగ్గరలో ఉంది.దీనికి వార్డెన్ గా యోగిరామ్ గారు ఉన్నారు.వారి అనుమతితో ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
          మానవ పరిణామ క్రమంలో మనిషి సాధించిన అద్బుత ఆవిష్కరణలను వివరిస్తూ మీరు కూడా ఏదో  సాదిం చటానికే ఈ భూమి పైకి వచ్చారని చెబుతూ బాగా  చదువుకుంటే వచ్చే ప్రయోజనాలు వివరిస్తూ భవిష్యత్ లో ఏయే ఉద్యోగాలకు ఏయే చదువులు చదవాలో వివరించటం జరిగింది.విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విని ఇచ్చిన  సూచనలు వ్రాసుకున్నారు.మరల ఎప్పుడు వస్తారు అంటూ విద్యార్థులు,వార్డెన్ గారు అడగటం ఆనందం కలిగించింది.ఈ సారి వచ్చి అందరిని విడివిడిగా కలిసి వారి విద్యా ప్రగతిని తెలుసుకొని భవిష్యత్ సూచనలు తెలియజేస్తానని చెప్పాను.ఈ సదస్సునకు అనుమతి ఇచ్చిన వార్డెన్ యోగిరామ్ గారికి ధన్యవాదాలు. మీరు ఎప్పుడు వచ్చినా మీకు మా ఆహ్వానం ఉంటుందని  చెప్పారు.ఈ కార్యక్రమానికి మా అబ్బాయి స్నేహిత్,డిగ్రీ విద్యార్ధి లక్ష్మి నారాయణ సహకరించారు.
 రవిశేఖర్,వార్డెన్ యోగి రామ్ గారు



   

No comments:

Post a Comment