Tuesday 19 May 2015

అనాధ బాలలకు మార్గం చూపే "మార్గ్ "

                   అనాధ పిల్లలకు ఆసరా ఇచ్చే లక్ష్యం తో 2007 డిసెంబర్ లో వినుకొండలో ప్రారంభ మయ్యింది ఈ సంస్థ దీనిని స్థాపించిన వారు  ఉపాధ్యాయుని గా పనిచేస్తున్న పటాన్ కరీముల్లాఖాన్. ముందుగా వినుకొండ  మండలం లోని  అన్ని పాటశాలలకు ఉత్తరం వ్రాసాడు.  అనాధ బాలలు ఉంటె తెలపమని అలా గుర్తించిన పిల్లలను నైస్ అనే పాటశాలలో చేర్పించాడు .తరువాత సంస్థకు చేయూత నందించ టానికి ఎంతోమంది ముందుకొచ్చారు అప్పుడు అనాధ బాలల సేవా సంస్థను Marg-way to bright future గా సంస్థ పేరును మార్చారు .
            ప్రస్తుతం ఈ సంస్థలో 2000 మంది సభ్యులున్నారు . ప్రధాన కేంద్రం వినుకొండలో ఉంది.ఎక్కడ అనాధ పిల్లలున్నారో సభ్యులు తెలియజేస్తే అక్కడికి వెళ్లి వారి వివరాలు సేకరించి వారిని తీసుకు వచ్చి గుంటూరు ,ప్రకాశం జిల్లాలలోని నైస్ ,saikrishana ఆశ్రమం ,వెంకటేశ్వర బాల కుటీర్,లిటిల్ హార్ట్ చిల్ద్రెన్  వంటి స్కూల్స్,సంస్థ లలో చేర్పిస్తుంటారు.ఇప్పటివరకు 430 మంది చిన్నారులు ఆయా సంస్థల్లో చదువుకుంటున్నారు. జీవితం లో స్థిరపడే వరకు ఆ పిల్లల బాధ్యతను మార్గ్ తీసుకుంటుంది.పసి పిల్లలను కూడా మహిళా శిశు సంక్షేమ సంఘానికి అందిస్తుంటుంది.సంస్థలో చేరేందుకు రూ 100 ప్రవేశరుసుము ఉంటుంది.వారిచ్చే విరాళాలతోనే సంస్థ నడుస్తుంటుంది .కొందరు ప్రతి రూ200 విరాళం ఇస్తుంటారు.ఈ సంస్థ సేవలు నచ్చడంతో ఉన్నతాదికారులు కూడా ఇందులో చేరుతున్నారు.
          అనాధల జీవితాలను సమూలంగా మార్చాలని ,అనాధలు లేని సమాజం చూడాలని ఖాన్ మరియు సంస్థ కోశాధికారి నాగరాజు చెబుతారు . 

No comments:

Post a Comment